విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఎన్నికలు లేకున్నా హీటెక్కిన పాలిటిక్స్‌

విజయోత్సవ సభలతో అధికార పార్టీ ఏడాది పాలన విజయాలపై డప్పు మోగిస్తోంది. ఏడాదిలో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇప్పుడు ఎన్నికలు లేవు, రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేదీ లేదు. కాని తెలంగాణ రాజకీయం మాత్రం ఆ స్థాయిలో వేడెక్కింది. విజయోత్సవ సభలతో అధికార పార్టీ ఏడాది పాలన విజయాలపై డప్పు మోగిస్తోంది. ఏడాదిలో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కేసీఆర్ టార్గెట్‌గా రేవంత్‌ విమర్శలు గుప్పిస్తుంటే గులాబీ దళం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. సీఎం రేవంత్ హనుమకొండ కేంద్రంగా కేసీఆర్‌ టార్గెట్‌గా ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు సంధించారు. వీటిపై గులాబీ దళం నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. రేవంత్ గంజాయి మొక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గంజాయి మొక్కను పీకి అవతల పారేస్తామంటూ హెచ్చరించారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను ఇలా విమర్శిస్తారా అంటూ ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తిలో రాక్షసుడిని ఆడబిడ్డ ఓడించిందన్న వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు ఎర్రబెల్లి. తనను రాక్షసుడు అని అంటున్నారు, అవును ప్రజలకు పనులు చేయడంలో తాను రాక్షసుడినే అన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ పార్టీ హనుమకొండలో వంచన సభ నిర్వహించిందన్నారు మాజీ స్పీకర్ మధుసూదన చారి. వటవృక్షంలా ఎదిగిన బీఆర్ఎస్‌ను కట్టడి చేయడం ఎవరి తరం కాదన్నారు. 11 నెలల పాలనలోనే రాష్ట్ర ప్రభుత్వం 85 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని బీఆర్ఎస్ నేత మధుసూదనా చారి ఆరోపించారు.