Team India: ఆసీస్టూర్లో వైఫల్యం.. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇక టెస్టు జట్టులో కనిపించరు!
సుమారు పదేళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియ సొంతం చేసుకుంది. సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లోనూ టీమిండియా పరాజయం పాలైంది. దీంతో 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1తో గెలుచుకుంది. ఈ పరాజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్ చేరే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. కాగా ఈ సిరీస్ లో టీమిండియా ఓటమి కంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి ఆటగాళ్ల ఆటతీరు గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ సిరీస్లో వీరిద్దరూ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకోలేకపోయారు. కాబట్టి వీరు తదుపరి టెస్టు సిరీస్లో ఆడడం కష్టమే. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం జూన్లో టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఇంగ్లండ్లో భారత జట్టు ఐదు టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది కొత్త డబ్ల్యూటీసీ వెర్షన్ కు ఓపెనింగ్ సిరీస్. దీంతో వచ్చే 6 నెలల్లోపు టీమిండియాలో ఏమైనా మార్పు వస్తుందా లేదా అనే దానిపైనే అందరి చూపు పడింది. విరాట్ రోహిత్ పాటు ప్రస్తుత జట్టులో ఉన్న ఈ ఆటగాళ్లు ఇంగ్లండ్ తో సిరీస్కు దూరంగా ఉండవచ్చు. కేవలం 6 నెలల క్రితం టీమ్ ఇండియాను T20 ప్రపంచ ఛాంపియన్గా మార్చిన రోహిత్ వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై వరుసగా 3 టెస్ట్ సిరీస్లలో, అతను కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పాటు చివరి టెస్టుకు దూరమైన రోహిత్ టెస్టు కెరీర్ దాదాపు ముగిసిపోయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత అతను సిరీస్లోని మిగిలిన 8 ఇన్నింగ్స్ల్లో 90 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో కోహ్లీ తన ఆటతీరును మెరుగుపరుచుకోకపోతే ఇంగ్లండ్ వెళ్లడం కష్టమే.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827