RGV : రాంగోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు..

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో ఈనెల 19న విచారణకు హాజరుకావాలని వర్మకు మద్దిపాడు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు... మరోవైపు ఈ కేసు కొట్టి వేయాలంటూ హైకోర్టులో వర్మ వేసిన స్వ్యాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టారన్న కారణంగా ఈనెల 10వ తేదీన మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో ఈనెల 19న విచారణకు హాజరుకావాలని వర్మకు మద్దిపాడు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు… మరోవైపు ఈ కేసు కొట్టి వేయాలంటూ హైకోర్టులో వర్మ వేసిన స్వ్యాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది… అవసరమైతే ముందస్తు బెయిల్‌ కోసం అప్పీలు చేసుకోవాలని సూచించింది… విచారణకు పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై సమయం అవసరమైతే విచారణ అధికారిని కోరవచ్చని హైకోర్టు పేర్కొంది… దీంతో ఈనెల 19న విచారణ కోసం ఒంగోలుకు రావాల్సిన వర్మ తనకు సమయం కావాలని కోరారు… వర్మను విచారించేందుకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి రెడీగా ఉన్న పోలీసులకు 19వతేది ఉదయం 8 గంటల ప్రాంతంలో వర్మ నేరుగా విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌బాబుకు వాట్సప్‌ మెసేజ్‌ చేశారు… తనకు ముందుగానే ఏర్పాటుచేసుకున్న షూటింగ్‌ల కారణంగా 19వ తేదీ విచారణకు హాజరుకాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలని కోరారు… అలాగే ఒంగోలుకు చెందిన తన లాయర్‌ ఎన్‌. శ్రీనివాసరావును వ్యక్తిగతంగా సిఐను కలిసేందుకు పంపించారు… విచారణకు హజరయ్యేందుకు వారం రోజుల గడువు కోరుతూ వర్మ పంపించిన రిక్వెస్ట్‌ లెటర్‌ను ఆయన తరపు లాయర్‌ సిఐ శ్రీకాంత్‌కు అందించారు… దీంతో వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు… నేడు అంటే ఈనెల 25వ తేదీన విచారణ అధికారి ముందు హాజరు కావాలని వర్మకు నోటీసులు పంపించారు…