Pakistan Protests: పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌తో సహా 10 మంది మృతి

పాకిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత మధ్య ఇస్లామాబాద్‌లో చోటు చేసుకున్న హింస తగ్గే సూచనలు కనిపించడం లేదు. పీటీఐ నేత సహా మొత్తం 10 మంది మరణించారు. నివేదికల ప్రకారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) కౌన్సెలర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కాల్చి చంపబడ్డాడు. మంగళవారం రాత్రి ఆయనపై కాల్పులు జరిగాయి. పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరుగుతున్న హింస తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ అంతటా హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పీటీఐ నేత సహా మొత్తం 10 మంది చనిపోయారు. నివేదికల ప్రకారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కౌన్సెలర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కాల్చి చంపబడ్డాడు. నిన్న రాత్రి ఆయనపై కాల్పులు జరిగాయి. రాజధానిలోని బ్లూ ఏరియాలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు.