Mohan Babu: టీవీ9 రిపోర్టర్ రంజిత్‌ను కలిసి సారీ చెప్పిన మోహన్ బాబు..

దాడి చేశారు. పశ్చాత్తాపం వ్యక్తం చేసి.. సారీ చెప్పాల్సింది పోయి.. హీట్ ఆఫ్ మూమెంట్‌లో జరిగిపోయింది అని కటింగ్ ఇచ్చారు. దీంతో టీవీ9 న్యాయపోరాటం చేసింది. దీంతో మోహన్ బాబు దిగివచ్చారు. టీవీ9 న్యాయపోరాటానికి నటుడు మోహన్‌బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. నా రూటే సెపరేటు.. నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్‌బాబు.. టీవీ9 న్యాయపోరాటానికి దిగివచ్చారు. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై హత్యాయత్నం చేసిన మోహన్‌బాబు టీవీ9కు, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరడంతో.. మోహన్ బాబు ఆ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యలను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు.