Ind vs Aus: టీమిండియాకు గాయాల బెడద.. ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లకే గాయం..

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, కె.ఎల్. రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లకు గాయాలయ్యాయి. రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం కూడా అనుమానమే. ఈ గాయాల కారణంగా టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకునే దృష్ట్యా ఈ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. కాబట్టి గెలవాలనే ఒత్తిడి జట్టుపై ఉంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు టీమ్ ఇండియా టెన్షన్ ఎక్కువై ఆ జట్టులోని నలుగురు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. దీనికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది.ఇప్పుడు సెలక్షన్ బోర్డుకు కొత్త తలనొప్పి మొదలైంది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ గాయపడ్డాడు. పెర్త్‌లో ఇండియా ఎతో జరిగిన మ్యాచ్‌లో స్లిప్ క్యాచ్ తీసుకుంటూ గిల్ వేలికి గాయమైంది. గాయం కూడా తీవ్రంగా ఉండడంతో పెర్త్ టెస్టులో ఆడే అవకాశం లేదు. అతడిపై వైద్య బృందం నిశితంగా నిఘా ఉంచిందని, తొలి మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది.