Amit Shah: నాగ్పూర్ చేరుకున్న అమిత్ షా… అకస్మాత్తుగా నాలుగు ఎన్నికల సభలు రద్దు..!
మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో 288 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మహారాష్ట్రలో కేంద్రమంత్రి అమిత్ షా ర్యాలీలన్నీ రద్దయ్యాయి. కేంద్ర హోంమంత్రి నాగ్పూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. వాస్తవానికి, అమిత్ షా ఈ రోజు(నవంబర్ 17) మహారాష్ట్రలో నాలుగు బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. మణిపూర్ హింసాకాండ కారణంగా ఆయన ఎన్నికల పర్యటన రద్దయినట్లు సమాచారం. గడ్చిరోలి, వార్ధా, కటోల్, సేవర్లలో అమిత్ షా ఎన్నికల ర్యాలీలు నిర్వహించాల్సి ఉంది. అమిత్ షా స్థానంలో స్మృతి ఇరానీ ఈ ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో 288 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు అమిత్ షా జోరుగా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా అతని ర్యాలీలన్నీ రద్దు అయ్యాయి. ఈసారి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి వర్సెస్ మహాయుతి మధ్య పోరు నెలకొంది. మహా వికాస్ అఘాడిలో ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్, NCP, కాంగ్రెస్ ఉన్నాయి. అయితే మహాయుతిలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీ, అజిత్ పవార్ అధ్వర్యంలోని NCP ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ మహాయుతిలో భాగం కాలేదు. అయితే ఈసారి ఆయన బీజేపీతో ఉన్నారు. మహారాష్ట్రలో పూర్తి మెజారిటీతో మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ ప్రకటించింది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827